Fact Check: ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే ఫలితాలు అంటూ వచ్చిన రిపోర్టు ఫేక్
ఇంటెలిజెన్స్ బ్యూరో ఎటువంటి సర్వే నిర్వహించలేదు
By Sridhar Published on 11 April 2024 12:24 PM GMTఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాతావరణం వేడెక్కుతోంది.
'ఏపీ ఎన్నికల పై సంచలన రిపోర్టు విడుదల చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో
ఏపీలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడి
124 సీట్లతో రెండోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నిఘా సంస్థ
ఎన్టీయే కూటమి 51 సీట్లకే పరిమితం అవుతుందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో
గత నెలలో 175 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ' అంటూ ETV నివేదించింది.
🔴*(ఈటీవీ స్క్రోలింగ్)*
— Shailaja Reddy (@ShailajaReddi) April 10, 2024
*ఏపీ ఎన్నికలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసిన ఇంటలిజెన్స్ బ్యూరో* pic.twitter.com/t7zLVp0J0v
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
నిజ నిర్ధారణ:
ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో వచ్చిన రిపోర్టు మరియు సర్వే ఫలితాలు ఫేక్ అని న్యూస్మీటర్ కనుగొంది.పైగా ETV రిపోర్టింగ్లో స్పెల్లింగ్ తప్పులను కూడా మనం చూడవచ్చు.
మరింత శోధిస్తున్నప్పుడు, IB సర్వే రిపోర్టు మరియు ETV ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న వీడియోను ఫేక్ అని పేర్కొంటూ టీడీపీ అధికారిక హ్యాండిల్ ద్వారా X లో పోస్ట్ కూడా కనుగొనబడింది.
నీ పార్టీ ఫేక్, నీ చదువు ఫేక్.. మీ బ్రతుకులే ఫేక్.. దొంగోడు సిబిఐకి దొరికినట్టు, ఈ ఫేక్ గాళ్ళు, తెలుగులో తప్పులు రాసి దొరికిపోయారు.. 5 ఏళ్ళు ప్రజలకు మంచి చేసి ఉంటే, ఇలా ఫేక్ చేసుకుని బ్రతకాల్సిన బ్రతుకు ఉండేది కాదు కదా.#YCPFakeBrathuku#EndOfYCP#YCPAntham #2024JaganNoMore… pic.twitter.com/jvbaRfZkGH
— Telugu Desam Party (@JaiTDP) April 10, 2024
ఆర్కైవ్ లింక్ ఇక్కడ